కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం నాడు మంద సత్యనారాయణ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించడం జరిగినది విద్యార్థుని విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి ఎన్నో విశిష్ట సేవలు అందించారని, భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచారన్నారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్ర్య అనంతరం ఎన్నో సంతానాలను భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేశారు స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లు ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు అని తెలిపారుఈ కార్యక్రమంలో చేరుపల్లి శ్రీనివాసులు, కొర్రలోక్య నాయక్, ఎబినేజర్ శ్రీపతి రావు, నల్ల నరసింహ, సముద్రాల శ్రీరయ్య, సరస్వతి, కలమ్మ,నీరజ, జనార్దన్ రెడ్డి, సూర్య చంద్రయ్య, సీతారాం, సైదా నాయక్, రసింహారావు, తదితరులు పాల్గొన్నారు