కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక కుటుంబానికే లబ్ది జరిగింది

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక కుటుంబానికే లబ్ది జరిగింది

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 12 (జనం సాక్షి)కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల మహిళా అవగాహన సదస్సు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 05 వ డివిజన్ శారదా గార్డెన్స్ లో కాంగ్రెస్ నాయకులు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 06 గ్యారంటీ పథకాల పై మహిళా అవగాహనా కలిగించారు
ఈ సందర్బంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో ప్రస్తుతం కేవలం ఓక కుటంబనికే లబ్ది జరిగింది అన్నారుతెలంగాణ ప్రజల కష్టాలు చూసి చెలించిన తెలంగాణ తల్లి సోనియా గాంధి గారు 06 పథకాలను ప్రవేశపెట్టారు అని కాబట్టి అందరు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండి నవంబర్ 30 నాడు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నీ గెల్పించాలని మహిళలను కోరారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ని ప్రజలు నాలుగు సార్లు ఓట్లు వేసి గెల్పిస్తే తను ప్రజలికి చేసింది ఏమీ లేదు అని ఇప్పటివారికీ నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు బస్తిల అభివృద్ధి, వరద ప్రభావానికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని తన సొంత లాభం కోసం వినయ్ భాస్కర్ పని చేస్తున్నారు అని అన్నారు. ఈ సందర్బంగా జంగా రాఘవ రెడ్డి తనని రాబోయే ఎన్నికలో పశ్చిమ ఎమ్మెల్యే గా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల కష్ట సుఖలో తోడు ఉంటానని ఈ నియోజకవర్గం లో తన సొంత నిధులతో ఒక్క కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ మరియు ఒక్క స్కూల్ ఏర్పాటు చేసి ఉచితంగా కార్పొరేట స్థాయి లో అందిస్తా అని రాఘవరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంటెస్ట్ఎడ్ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ నాయుకులు, మహిళా కాంగ్రస్ నాయకులు, సీనియర్ నాయుకులు తదితరులు పాల్గొన్నారు