కొలువుదీరిన మోడీ కొత్త కేబినెట్
కేంద్ర కేబినెట్ విస్తరణ ముగిసింది. ప్రస్తుతం స్వతంత్ర హోదాలో మంత్రిగా పని చేస్తున్న ప్రకాశ్ జవదేకర్ కు కేబినెట్ హోదా కల్పించారు. ఆయనతో పాటూ మరో 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణం చేసిన కేంద్రమంత్రులు వీరే
1. ఫగ్గన్ సింగ్ కులస్తే (మండ్లా, మధ్యప్రదేశ్)
2. ఎస్ఎస్ అహ్లువాలియా( డార్జిలింగ్, పశ్చిమ్ బంగా)
3. రమేష్ చందప్ప జిగజినాగి (బిజాపూర్, కర్ణాటక)
4. విజయ్గోయాల్ (రాజ్యసభ, రాజస్థాన్)5. రామ్దాస్ అథవలే, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (మహారాష్ట్ర, రాజ్యసభ)
6.రాజెన్ గోహేన్ (నాగావ్, అసోం)
7. అనిల్ మాధవ్ దవే (మధ్యప్రదేశ్, రాజ్యసభ)
8. పురుషోత్తమ్ రూపాలా, (గుజరాత్, రాజ్యసభ)
9. ఎంజే అక్బర్(ఝార్ఖండ్, రాజ్యసభ)
10. అర్జున్ రామ్ మేఘ్వాల్ (బకనీర్, రాజస్థాన్)
11. జశ్వంత్ సిన్హ్భాబోర్ (దాహోద్, గుజరాత్)
12. మహేంద్రనాథ్ పాండే(చండౌలి, ఉత్తర ప్రదేశ్)
13. అజయ్ టంటా (అల్మోరా, ఉత్తరాఖండ్)
14 కృష్ణారాజ్ (షాజనాపూర్, ఉత్తరప్రదేశ్)
15. మన్సుఖ్ భాయ్ మందావియా, (గుజరాత్, రాజ్యసభ)
16. అనుప్రియ పటేల్, (అప్నాదళ్ పార్టీ) (మిర్జాపూర్, ఉత్తర్ ప్రదేశ్)
17. సీఆర్ చౌదరి( నాగౌర్-రాజస్థాన్) 18. పీపీ చౌదరి (పాలి, రాజస్థాన్)
19. శుభాష్ రామ్రావ్ భామ్రే (ధూలే, మహరాష్ట్ర) ప్రమాణం చేశారు.