కొల్లం బయలుదేరిన కర్ణాటక వైద్య బృందం

కొల్లం: కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 102 మంది మృతిచెందగా, దాదాపు 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు సహాయక చర్యల నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు మెడికల్‌ కళాశాలకు చెందిన 10 మంది వైద్య బృందాన్ని కొల్లం పంపింది.