కోడేరు మండల మాజీ ఎంపిపి శేషన్న మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన,చింతపల్లి జగదీశ్వర్ రావు

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 07 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని  జనుంపల్లి గ్రామానికి చెందిన కోడేరు మండల మాజీ ఎంపీపీ శేషన్న  గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ పరమపదించరు.విషయం తెలుసుకున్న కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు,ఈ రోజు శేషన్న. నివాసానికి వెళ్లి ఇంటి పెద్దదిక్కును కోల్పోయి శోకసంద్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసిన.కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు.
ఒక మంచి నాయకుడిని కోల్పోయామని ప్రజలకు శేషన్న  చేసిన సేవలను మరియు గతంలో ఆయన సర్పంచిగా, కోడేరు మండల సింగల్ విండో చైర్మన్ గా, మరియు కోడేరు మండల ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గూర్చు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిద్దె శాంతయ్య,కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరపాగ కిరణ్ కుమార్,కోడేరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుపుల నాగేంద్రం,కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి,వెంకట్ రెడ్డి,రఘు, ఇట్టే గోపాల్ రెడ్డి,గువ్వల రాము,స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.