కోతకు గురైన బ్రిడ్జిలను మరమ్మత్తులు చేయండి
రుద్రంగి సెప్టెంబర్ 18 (జనం సాక్షి)
వేములవాడ నియోజకవర్గం రుద్రంగీ నుండి కొత్తపేట వెళ్ళే మార్గ మధ్యలో కోతకు గురైన బామండ్ల వాగు మరియు కొత్తపేట పెద్దమ్మ గుడి వద్ద గల వాగు కోతకు గురై ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇట్టి కోతకు గురైన వాగులను ఈరోజు బహు జన్ సమాజ్ పార్టీ గ్రామశాఖ అద్యక్షులు కాదాసు మహేందర్ అధ్వర్యంలో పరిశీలించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి దర్శనం గంగాధర్, నియోజకవర్గ కోశాధికారి దయ్యాల ఉదయ్,రుద్రంగి మండల అద్యక్షులు కట్కురి శంకర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 30సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మీకు రుద్రంగి నుండి కొత్తపేట కు వెళ్ళే రహదారిని వేయాలని కనీస సోయి కూడా లేదా ప్రశ్నించారు.. మీరు వేములవాడకు ఎమ్మెల్యే నా లేక జర్మనీకి ఎమ్మెల్యే నా అని ఎద్దేవా చేసారు.. ఇప్పటి వరకు 5సార్లు తాత్కాలిక మరమత్తులు చేసి ప్రజా ధనాన్ని వృధా చేశారు.. తక్షణమే తారు రోడ్డులు మరియు బ్రిడ్జిలు నిర్మించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. బ్రిడ్జి నిర్మాణం చేయని ఎడల మీకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు.. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు కట్కురి రమేశ్, నాయకులు లింగంపల్లి సుదర్శన్, కుంటాల ప్రవీణ్,నేవురి నగేష్, కట్కురి నర్సయ్య, గసికంటి నర్సయ్య, ప్రవీణ్, తర్రే కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area