కోదండరామాలయంలో 10న  పుష్పయాగం 

తిరుపతి,మే3(జ‌నంసాక్షి): తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో  10వ తేదీన జరుగనున్న పుష్పయాగ మ¬త్సవం గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం ఆవిష్కరించారు.
9న సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ జరుగనుందని తెలిపారు. 10న ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారని వివరించారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారని చెప్పారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలియజేశారు. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చన్నారు. శ్రీకోదండరామాలయంలో ఏప్రిల్‌ 3 నుండి 11వ తేదీ వరకు వార్షిక బ్ర¬్మత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్ర¬్మత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.