కోనేరు ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోసం పిటిషన్‌

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసుకు సంబందించి సిటి సివిల్‌ కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. కోనేరు ప్రసాద్‌, సునీల్‌ రెడ్డిల అస్తుల అటాచ్‌మెంట్‌ కోసం సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. కోనేరు ప్రసాద్‌కు అతని కుటుంబ సభ్యులకు భీమిలిపట్నం, విశాఖ, సబ్బవరం, విజయనగరం, బోగాపురంలలో ఆస్తులున్నట్లు గుర్తించారు. సునీల్‌రెడ్డికి మహబూబ్‌నగర్‌,కడప, హైదరాబాద్‌లలో ఆస్తులున్నట్లు గుర్తించారు.