కోరం లేక మండల సర్వ సభ్య సమావేశం వాయిదా

వేమనపల్లి,నవంబర్ 24,(జనంసాక్షి)

వేమనపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రజా ప్రతినిధులు రాకపోవడంతో కోరం లేని కారణంగా ఎంపిడిఓ అల్లూరి లక్ష్మయ్య సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో ఎంపీపీతో సహా సభ్యులెవరూ హాజరు కాలేదు.తిరిగి మూడు నెలల లోపు సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఎంపీడీఓ తెలిపారు.ప్రజల సమస్యలను అధికారుల ముందు ప్రస్తావించి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం వారి చిత్తశుద్ధిని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.