క్యాష్ సరఫరా వ్యాన్లో లిక్కర్
పాట్నా,అక్టోబర్31(జనంసాక్షి): ఏటీఎం క్యాష్ వ్యాన్లో లిక్కర్ సరఫరాను ఎక్సైజ్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటన బిహార్లో చోటుచేసుకుంది. ఏటీఎం మిషిన్లకు నగదు సరఫరా చేసే వ్యానులో 100 లిక్కర్ కార్టూన్స్ను తరలిస్తుండగా గయలోని దోబీ వద్ద ఎక్స్జ్ అధికారులు పట్టుకున్నారు. లిక్కర్ను సీజ్ చేసిన అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు బోకారో నుంచి ముజఫర్పూర్కు లిక్కర్ తరలిస్తున్నట్లుగా సమాచారం. కాగా ఆ వ్యాను ఏ బ్యాంకుకు సంబంధించిందో ఇంకా తెలియరాలేదు. విచారణ కొనసాగుతున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.