క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

మెహదీపట్నం , హైదరాబాద్‌: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లపై బెట్టింగ్‌కి పాల్పడుతున్న ముఠాను పశ్చిమ మండలం ప్రత్యేక పోలీసు బృందం రెహ్మత్‌నగర్‌లో పట్టుకున్నారు. పాకలపాటి అనే యువకులు బెట్టింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. వారినుంచి రూ.70 నగదు, 31 సెల్‌ఫోన్లు, మోటారు సైకిల్‌, రెండు ల్యాప్‌ట్యాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.