క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సింగల్ విండో చైర్మన్

మల్దకల్ అక్టోబర్ 23(జనంసాక్షి) మండల పరిధిలోని శేషంపల్లి గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా గ్రామీణ క్రికెట్ టోర్నమెంటును ఆదివారము సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని క్రీడలు మానసిక, ప్రశాంతత, వ్యక్తులోని నైపుణ్యాన్ని వెలికితీస్తుందని అన్నారు. శేషం పల్లి ప్రీమియర్ లీగ్ గ్రామ యువకుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.మల్దకల్ సింగిల్ విండో చైర్మన్ శేషంపల్లి తిమ్మారెడ్డి మొదటి బహుమతిగా 10,000, రెండవ బహుమతి,సర్పంచ్ ప్రతాప్ 5000 ఇస్తున్నట్లు క్రికెట్ మేనేజ్మెంట్ బాపిరెడ్డి,పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎస్ బ్రహ్మానందరెడ్డి, శేషు రెడ్డి, గ్రామ యువకులు,తదితరులు పాల్గొన్నారు.