క్షమాపణ చెప్పిన అజిత్‌ పవార్‌

ముంబై : వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ క్షమాపణ చెప్పారు. నీటి ఎద్దడిపై శాసనసభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో పవార్‌ దిగివచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదన్నారు. అంతకుముందు సభలో గందరగోళం చెలరేగడంతో రెండుసార్లు వాయిదా పడింది.