ఖమ్మం: పెద్ద చెరువును పరిశీలించిన ఎస్ఈ
దౌల్తాబాద్: మినీ ట్యాంక్బండ్ నిర్మాణం కోసం నియోజకవర్గంలోని దౌల్తాబాద్ పెద్ద చెరువును నీటి పారుదలశాఖ ఎస్ఈ లింగ రాజు పరిశీలించారు. మిషన్ కాకతీయ పథకంలో చెరువును రెండవ విడతలో ఎంపిక చేసి చెరువులో పేరుకొపోయిన ఒండ్రు మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పెద్ద చెరువును ఆయన పరిశీలించారు. మినీ ట్యాంక్బండ్ నిర్మాణం చేపట్టేందుకు దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.6కోట్ల వరకు ప్రతిపా దనలు తయారు చేయాలని సూచించారు. ఈ సందర్బంగా ఈఈ ఆనంద్సాగర్, డీఈ గోవిందస్వామి, జేఈ బ్రహ్మయ్య ఉన్నారు.