గంగా కావేరి సీడ్స్ మొక్కజొన్న పంటపై ప్రదర్శన

కొత్తగూడ అక్టోబర్ 8 జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రాంపూర్ లో గంగ కావేరి సీడ్స్ మొక్కజొన్న పంట ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు.ఈ సందర్భంగా కంపెనీ ఏరియా మేనేజర్ మధుకృష్ణ మాట్లాడుతూ జికె.3122 మొక్కజొన్న రకం వర్షాకాలము,యాసంగికి అనుకూలమైన విత్తనం గా పేర్కొనబడింది.పలురకాల తెగుళ్ళను తట్టుకునే శక్తి ఉందన్నారు.జి కె  3122 నారింజ రంగు కలిగి సన్నటి బెండు తో ఉంటుందని అన్నారు.ఇతర రకాలతో పోలిస్తే అధిక దిగుబడి ఉంటుందని చెప్పడం జరిగింది.గ్రామానికి చెందిన రైతు ఈక కిషోర్ పొలం లో నిర్వహించిన ఈ  కార్యక్రమంలో రైతు కిషోర్ మాట్లాడుతూ మన భూములకు నీటి ఎద్దడిని తట్టుకొని అధిక దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను ఇలాంటి విత్తనాన్ని ఇచ్చిన గంగా కావేరి సీడ్స్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమానికి కొత్తగూడ మండల చుట్టుపక్కల గ్రామాల నుండి 120 మంది రైతులు పాల్గొన్నారు.ఈ క్షేత్ర ప్రదర్శనల్లో కొత్తగూడ డిస్ట్రిబ్యూటర్ నాగేంద్ర ఏజెన్సీస్ శ్రీనివాస్,డీలర్ స్.కే.పాష ,ఏరియా మేనేజర్ మధుకృష్ణ,టెర్రిట్టరీ మేనేజర్ శంకర్ కంపెనీ ప్రతినిధి మహేందర్ పాల్గొన్నారు.