గంజాయిమత్తులో నేరాలు: నలుగురు అరెస్ట్‌

విజయవాడ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): విజయవాడ నగరంలో నలుగురు నేరస్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్న నలుగురు పాత నేరస్థులను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ 1.74 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు బైకులు, ఆరు కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో మరో ముగ్గురు నిందితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.