గంటల వ్యవధిలోనే మరో రైలు ప్రమాదం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లో శక్తిపుంఝ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన గంటల వ్యవధిలోనే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ దిల్లీలోని మింటో బ్రిడ్జి సవిూపంలో పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్‌, ఒక బోగీ పట్టాల నుంచి పక్కకి వెళ్లిపోయినట్లు ఉత్తరరైల్వే ప్రతినిధి వెల్లడించారు. అయితే.. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర ప్రాంతంలో హౌరా నుంచి జబల్‌పూర్‌ వెళుతున్న శక్తిపుంజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏడు బోగీలు పక్కకి ఒరిగిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నెల వ్యవధిలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు ఆరు రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. గతనెలలో యూపీలో పూరి-హరిద్వార్‌ విూదుగా వెళ్తున్న ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 13 బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.