గందరగోళంగా పెద్ద నోట్ల రద్దు విషయం
పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షస్థానంలో ఉన్నారు. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. లోక్సభలో విపక్షాల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు విషయం ఆర్థిక మంత్రికి కూడా తెలియదని అంటున్నారని, అటువంటి సమయంలో పార్టీ సభ్యులకు ఎలా తెలుస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా దీనిని హర్షిస్తున్నారని ఆయన చెప్పారు. నోట్ల రద్దు అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా సభను అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.