గడప కృష్ణమూర్తి కి సన్మానం

కమాన్ పూర్, జనంసాక్షి, అక్టోబర్ 07: పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని రొంపికుంట గ్రామంలో శనివారం రైతు బందు సమితి మండల అధ్యక్షులు గడప కృష్ణమూర్తిని బీ. ఆర్. ఎస్ నాయకులు, కార్యకర్తలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇటీవల నూతనంగా ఆర్. బీ. ఎస్ మండల అధ్యక్షులుగా నియమితులై రొంపికుంట గ్రామానికి వచ్చిన సందర్బంగా ఈ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
బీ. ఆర్. ఎస్ మండల అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, వైస్ ఎంపిపి ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, పి. ఏ. సీ. ఎస్ వైస్ చైర్మన్ చిందం తిరుపతి, బీ. ఆర్. ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొయ్యడ రవి, మాజీ పి. ఏ. సీ. ఎస్ చైర్మన్ బాద్రపు మల్లేష్, నాయకులు కమ్మగోని భాస్కర్, ఊరడీ శ్రీను, కొండి అనిల్, గన్నేవరపు కొమురయ్య, గన్నేవరపు కనకయ్య, జంగిలి రాములు, చంద్రయ్య, కొయ్యడ రవి, కుమార్, కొండి సంపత్, కూషణ కనకయ్య, కటకం శ్రీను,కొండి రవి, ఆడెపు రాయమల్లు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.