గద్వాల పట్టణంలో “సరితమ్మ” గడపగడప కాంగ్రెస్ పార్టీ ప్రచారం

8,22వ వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితమ్మ గడపగడప ప్రచారం..

– మీ బహుజన బిడ్డగా వచ్చిన ఓటు వేసి ఆశీర్వదించండి…

– కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ..

గద్వాల పట్టణంలోని 8 మరియు 22వ వార్డ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరితమ్మ గడపగడప ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ ఎల్లప్ప,భాస్కర్ యదవ్ లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళలతో కలిసి ఘన స్వాగతం పలికారు…కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడపగడప కు మీ బహుజన బడుగు బలహీన వర్గాల బిడ్డగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సరితమ్మ ఓటర్లను అభ్యర్థించారు..

అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితమ్మ మాట్లాడుతూ…

గత పాలకుల పుణ్యమా పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని,ప్రజలకు వచ్చిన సంక్షేమం అంత వారి బంగ్లా లకు తరలించుకొని, ప్రజలకు సున్నం పెట్టారు… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబంలో అర్హులైన ప్రతి ఒకరికి 4000/- రూపాయలు, ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా క్రింద రైతుకు 15000 ఎకరానికి, కౌలు రైతుకు 12000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుందని, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తుందని సరితమ్మ తెలిపారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల లక్ష్మీదేవి, గంజిపేట్ శంకర్, మధుసూదన్ బాబు,టిజెఎస్ ఆలూరు ప్రకాష్ గౌడ్, సిపిఐ ఆంజనేయులు,టిడిపి గంజిపేట్ రాములు,నల్లారెడ్డి,యూసుఫ్,ఇషాక్,ఎల్లప్ప, భాస్కర్ యాదవ్, నాగేంద్ర యాదవ్, తుమ్మల నరసింహ, గంజిపేట్ తిమ్మన్న,అతియా, జహంగీర్,తిమోతి,అన్వర్, గంజిపేట్ రాము,కరాటే సత్యం, దినేష్,గోపాల్, కొత్త గణేష్,జమ్మిచేడు ఆనంద్,TNR జగదీష్,మోహన్ యాదవ్, ఏకే.వెంకటన్న,చేపల చిన్న,సత్యం, సైఫ్,జమల్,కౌసర్ బేగ్, ఇలియాస్,కిఫాయిత్, తదితరులు ఉన్నారు

తాజావార్తలు