గవర్నర్పై మోదీ విమర్శ
న్యూఢిల్లీ : స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును గుజరాత్ గవర్నర్ కమలా బేణివాల్ తొక్కిపెట్టారని ముక్యమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించినప్పటికీ గవర్నర్ సంతకం చేయకపోవడంతో అమలు చేయలేకపోతున్నామని ఆయన వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లపై ఫిక్కీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మోదీ పై విధంగా సమాధానమిచ్చారు.