గవర్నర్‌ దంపతుల పుష్కరస్నానం

1

హైదరాబాద్‌,జులై20(జనంసాక్షి):

గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు సోమవారం ఉదయం రాజమండ్రిలోని వీఐపీ పుష్కరఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలిక్టాపర్‌లో రాజమండ్రి చేరుకున్న గవర్నర్‌ దంపతులకు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సరస్వతీ వీఐపీ ఘాట్‌కు చేరుకున్న గవర్నర్‌ దంపతులు గోదావరిలో దిగి పుష్కరస్నానం చేశారు. అర్చకులు గోదావరి పుష్కర ప్రాశస్త్యాన్ని గవర్నర్‌ దంపతులకు వివరించారు. అక్కడ స్నానాలు చేసి గోదావరికి పూజలు చేశారు. అనంతరం రాజమండ్రి నుంచి ఖమ్మం జిల్లా బయలుదేరి వెళ్లారు.