‘గాలి’ కుంటుబానికి రోల్స్ రాయ్స్ కారు ఆప్పగింత
బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి చెందిన రోల్స్ రాయ్స్ కారును సీబీఐ అధికారులు గురువారం ఆయన కుంటుంబసభ్యులకు అప్పగించారు. మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్దనరెడ్డికి చెందిన విలువైన కారను, హెలికాప్టర్, అత్యాధునిక హంగులతో కూడిన బస్సును సీబీఐ అధికారులు అక్టోబరు 2011లో స్వాధినం చేసుకున్నారు. దీనిపై గాలి జనార్దనరెడ్డి కోర్టుకు వెళ్లడంతో, కోర్టు సూచనల మేరకు ఇటీవల హెలికాప్టర్, బస్సును అప్పగించగా తాజాగా రోల్స్ రాయ్స్ కారునూ అప్పగించారు.