గాలి జనార్దన్‌రెడ్డికి ఐటీ షాక్

janardhana-reddyగాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్‌ కంపెనీపై సోమవారం ఆదాయ పన్నుశాఖ(ఐటీ) దాడులు చేసింది. ఇటీవల జనార్దన్‌ రెడ్డి రూ.650కోట్లకు పైగా ఖర్చుపెట్టి కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సమాచార హక్కు, సామాజిక కార్యకర్త టి.నరసింహమూర్తి ఆదాయపు పన్ను డైరెక్టర్‌ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. వివాహ వేడుకలకు వ్యయం చేస్తున్న నిధుల మూలాలపై విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఫిర్యాదును పరిశీలించిన ఐటీశాఖ సోమవారం దాడులు చేపట్టింది. జనార్దన్‌రెడ్డి బెంగళూరు రాజమహల్‌ మైదానంలో తన కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా చేసిన సంగతి తెలిసిందే. దీనికి సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలను నుంచి అతిరథ మహారథులు ఎంతో మంది విచ్చేశారు. ఈ వివాహ‌ వీడియో ఆహ్వానాలకే రూ.6 కోట్ల వ్యయం చేసినట్లు మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి.