గిరిజనులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలి

బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు ఆకేపోగు రాంబాబు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 28 సీఎం కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ల అమలు చేస్తానని చెప్పిన హామీని తక్షణమే నెరవేర్చాలని బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు ఆకేపోగు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మండల పరిధిలోని వావిలాల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను 10 రోజులలో కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి 10 రోజులకు పైగా గడిచిన రిజర్వేషన్ల సంగతి ఆలోచించడం లేదన్నారు. రిజర్వేషన్లు అంటు గిరిజనులను కేవలం ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే రిజర్వేషన్లు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సభ్యులు వినోద్, మోహన్ రాజ్, ఆకేపోగు బీసన్న, సాతర్ల ప్రభాకర్, సాతర్ల బీసన్న, భాస్కర్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.