గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపిన సిఎం కెసిఆర్.
నేరడిగొండసెప్టెంబర్19(జనంసాక్ షి):
గిరిజనులకు10 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా అడుగులు వేస్తూ దళితబందు తరహాలో గిరిజన బంధు కూడా ఇస్తామని చెప్పి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు కేసీఆర్ అని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.సోమవారం రోజున మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ అనిల్ జాదవ్ ఎంపీపీ సజన్ రాథోడ్ లు మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లో రూ.60 కోట్లతో కుమ్రం భీం ఆదివాసీ సేవాలాల్ బంజారా భవన్లను కట్టి ఇచ్చినందుకు
తెలంగాణ గిరిజనులకు వారం రోజుల్లో 10శాతం రిజర్వేషన్లు పెంచి తెలంగాణలో భూమిలేని నిరుపేద గిరిజనులకు10 లక్షల రూపాయలిచ్చి గిరిజన బంధు అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ గిరిజనుల పాలిట దైవమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెరాస మండల కన్వీనర్ శివరెడ్డి సర్పంచ్లు సుభాష్ మహేందర్ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి పెంటవెంకటరమణ వినోద్ దనుజయ్ ప్రశాంత్ సంతోష్ మనోజ్ గణేష్ చంటి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.