గుండూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిత తనిఖీ చేసిన డిఇఓ గోవిందరాజులు

కల్వకుర్తి మండల పరిధిలోని గుండూర్ గ్రామ లో  జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలను డిఇఒ గోవిందరాజులు గురువారం తనిఖీ చేశారు.

విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.
మన ఊరు మనబడి పనుల వివరాలపై ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు.
 ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడంతోపాటు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని విద్యాబోధన చేయాలని సూచించారు.
బయోమెట్రిక్ అటెండెన్స్ పదవ తరగతి ప్రత్యేక తరగతులపై ఉపాధ్యాయులతో సమీక్షించారు.
ఆయన వెంట మండల విద్యాధికారి బాసు నాయక్ ఉన్నారు.