గుండెపోటుకు గురై వరుడు మృతి

తుమకూరు: తాళికట్టు శుభవేళ… అని పెద్దలు అన్నారు. కానీ వరుడు వసంతకుమార్‌ (33) విషయంలో మాత్రం అది అశుభంగా మారింది. తాళికట్టడానికి ముందే గుండెపోటుకు గురై వరుడు చెందాడు. కర్ణాటక తుమకూరు తాలూకా మల్లసంద్ర గ్రామానికి చెందిన యువతితో ఇతడి వివాహం గవిరంగ కల్యాణమండపంలో జరగాల్సి ఉంది. శనివారం రాత్రి రిసెప్షన జోరుగానే జరిగింది. ఉదయం తాళి కట్టాల్సిన సమయంలో ఒక్కసారిగా వసంతకుమార్‌ కుప్పకూలాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వధూవరులు ఇద్దరూ ఎంటెక్‌ చదివారు. వరుడి మృతిని జీర్ణించుకోలేక వధువు స్పృహ తప్పింది. విధిరాత అంటే ఇదేనేమో…