గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

10 మంది మృతి

ప్రధాని మోదీని కలచివేసిన దుర్ఘటన

గాంధీనగర్‌, నవంబర్‌18(జ‌నంసాక్షి): గుజరాత్‌లోని వడోదరలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది మతి చెందగా, 17 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వాఘెడియా క్రాసింగ్‌ వద్ద రెరడు ట్రక్కులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెరడు వాహనాలు కూడా నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే ముందుగా ప్రమాద స్థలంలో 9 మంది మతి చెందగా, గాయాలైన వారిలో మరొకరు మతి చెందారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తీవ్ర దిగ్బంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా కలచివేసింది. ఒకేసారి ఇంత మంది మతి చెందడం ఎంతో బాధ కలిగించిందని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని మోదీ అధికారులకు సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అన్ని విధాలుగా సహయక చర్యలు చేపట్టండి అని అన్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సమచారం అందుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.