గుజరాత్‌ సచివాలయంలో చిరుత సంచారం

గాంధీనగర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఉన్న సచివాలయంలోకి సోమవారం చిరుత పులి ప్రవేశించింది. ఈ విషయం సిసి ఫుటేజ్‌ల ద్వారా తెలుసుకున్న అధికారులు చిరుతను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రక్షణ వలయాన్ని దాటి ప్రాంగణంలోకి ఎలా ప్రవేశించిందో స్పష్టంగా తెలియరాలేదు. రాత్రి 1 గంట సమయంలో సచివాలయంలో చక్కర్లు కొట్టినట్లు సిసిఫుటేజ్‌లో నమోదయ్యింది. దీంతో సచివాలయ ఆరు గేట్లను పోలీసులు మూసివేశారు. ప్రజలను, మంత్రులను, అధికారులను సచివాలయ ప్రవేశాన్ని నిషేధించారు. చిరుతపులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు.