గురుకుల ఉపాధ్యాయులకు సుప్రీంలో ఊరట

ఢిల్లీ: గురుకుల ఉపాధ్యాయులకు సుప్రీంలో ఊరట లభించింది. 60ఏళ్ల రిటైర్‌మెంట్ వయసు వర్తించదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురుకుల ఉపాధ్యాయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే 9,10 షెడ్యూల్‌లోని సంస్థల్లోని ఉపాధ్యాయులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తొలగించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.