గురుగావ్లో దారుణం
జడ్జి భార్యను,కొడుకును కాల్చిన దుండగుడు
గురుగావ్,అక్టోబర్13(జనంసాక్షి): హర్యానాలోని గురుగావ్లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఒక జడ్జి భార్య, కొడుకును ఒక దుండగుడు కాల్చి చంపాడు. సెక్టార్ 49లోని ఆర్కడియా మార్కెట్ సవిూపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘోరం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. జడ్జి భార్య, కొడుకును ఆగంతకుడు ఎందుకు పొట్టన పెట్టుకోవాల్సి వచ్చిందని కానీ, అతనెవరి కానీ ఇంకా తెలియలేదు. దుండగుని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.