గురుదాస్పూ ర్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం
పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఈ బై పోల్ లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నప్పటికీ.. కాంగ్రెస్ గెలించింది. బీజేపీ రెండో స్థానంలో, ఆప్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బీజేపీ నుంచి స్వరణ్ సలారియా, ఆప్ నుంచి రిటైర్డ్ మేజర్ జనరల్ సురేశ్ ఖజురై పోటీ పడ్డారు. వినోద్ ఖన్నా మృతి చెందడంతో.. గురుదాస్ పూర్కు ఉప ఎన్నిక వచ్చింది.