గూడురులో గడప గడపకు కాంగ్రెస్..

భువనగిరి జనం సాక్షి:-
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో ఈరోజు భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గ్రామ మహిళలుమంగళహారతులతో, ప్రజలంతా అపూర్వ స్వాగతం పలికారు.గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆరు గ్యారంటీ పథకాలను గడప గడపకు వెళ్ళి వివరించి కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు.నూతనంగా ఓటు హక్కు పొందిన 20 మంది యువకులు కుంభం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్, సిపిఐ, టిడిపి నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, NSUI, మహిళా విభాగం, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.