గోదావరికి క్రమంగా వరద తగ్గుముఖం

తేరుకుంటున్న పలు ప్రాంతాలు

ములుగు,జూలై18(జనంసాక్షి): వారం రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెమ్మదించింది. గోదావరితో పాటు ఉప్పొంగి ప్రవహించిన
వాగులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం (సరస్వతి) బ్యారేజీలోకి శనివారం 81,126 క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా ఆదివారం 6,618 క్యూసెక్కులకు పడిపోయింది. 66 గేట్లను ఎత్తి అంతే మేరకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 108.40 విూటర్లుగా ఉంది. అన్నారం బ్యారేజీ ఇన్‌ఎª`లోతో పాటు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత నుంచి 9,22,602 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వచ్చి కలుస్తుండటంతో గోదావరి 11.95 విూటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి.. ప్రాణహిత, అన్నారం బ్యారేజీ ఇన్‌ప్లో కలిపి 9,28,410 క్యూసెక్కులు వస్తోంది. బ్యారేజీ 85 గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తుండగా నీటి మట్టం 96.70 విూటర్లు నమోదైంది. తుపాకులగూడెం (సమ్మక్క సాగర్‌) బ్యారేజీకి 9,25,400 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వచ్చి చేరుతుండగా 59గేట్లను ఎత్తి మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 83.05విూటర్ల ఎత్తులో ఉంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కఘాట్‌ వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది.గోదావరి మహోగ్రరూపం నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి వారధిపై మూడు రోజులుగా నిలిపేసిన రాకపోకలను ఆదివారం పునరుద్ధరించారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో సెక్షన్‌ 144ను ఉపసంహరించినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ వెల్లడిరచారు. గోదావరి తుది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోందని, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చర్ల మండలంలో ముంపు ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులను ఆర్మీ హెలికాప్టర్‌ ద్వారా పంపారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. కరీంనగర్‌ జిల్లాలో 9.7 మిల్లీవిూటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చొప్పదండి మండలంలో 1.84 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 2.14 సెం.విూ., మల్యాలలో 1.32 సెం.విూ. జగిత్యాలలో 1.02 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5.7 మి.విూ., పెద్దపల్లి జిల్లాలో 9.2 మి.విూ., మంచిర్యాల జిల్లాలో 3.8 మి.విూ. వర్షపాతం నమోదైంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. ఎగువన వర్షాలతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బెజ్జూరు మండలంలోని పరీవాహక గ్రామాలు మునిగాయి. లింగాపూర్‌లో 2.55 సెం.విూ. వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. పెనుబల్లి మండలంలో 2.04 సెం.విూ., కల్లూరులో 1.90 సెం.విూ. వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లోనూ చిరుజల్లులు కురిశాయి. ఒడిసా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఒడిసా`పశ్చిమ బెంగాల్‌ తీరంలో కొనసాగినట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఈ అల్ప పీడనం ప్రభావంతో సోమవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడేంలో అత్యధికంగా 110 మిల్లీ విూటర్ల వర్షపాతం నమోదైంది.