గోస్వామి సతీమణికి అశోక చక్ర అవార్డు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. దివంత లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి సతీమణికి అశోక చక్ర అవార్డును అందజేశారు. అత్యంత ధైర్యసాహసాలు కనబరిచిన గోస్వామి రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లో పనిచేశారు. గత ఏడాది సెప్టెంబర్లో జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగిన దాడిలో గోస్వామి టెర్రరిస్టులను సమర్థంగా ఎదుర్కొన్నారు. గాయపడ్డ తోటి సైనికులను గోస్వామి తన ప్రాణాలకు తెగించి కాపాడారు. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు టుర్రరిస్టులను హతమార్చడంతో పాటు ముగ్గురు సైనికులను రక్షించారు.