గౌహతిలో పేలుడు: నలుగురికి గాయాలు
గౌహతి,అక్టోబర్13(జనంసాక్షి): అస్సాంలోని గుహవతిలో పేలుడు జరిగింది. షుకలేశ్వర్ ఘాట్ వద్ద ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు వల్ల నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ మహిళ ఉంది. పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇవాళ ఉదయం 11.45 నిమిషాలకు పేలుడు జరిగిందని జాయింట్ సీపీ దిగంత బోరా తెలిపారు. నది వద్ద ఉన్న ఘాట్లో పేలుడు చోటుచేసుకుంద న్నారు. పేలుడులో ఉగ్ర చర్య లేదని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం అక్కడ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ పరిసరాలను చెక్ చేస్తోంది. పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశారు. పేలుడులో నలుగురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలు ఇంకా గుర్తించలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పేలుడు ఘటనతో గువహటితో పాటు అసోంలోని ఇతర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.