గ్యాంగ్ రేప్ చేసి వీడియో షేర్ చేశారు
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 15,16 ఏళ్ల వయసున్న నలుగురు అబ్బాయిలు పథకం ప్రకారం బాధిత బాలికను పిలిచారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని కంబైన్డ్ స్టడీ పేరుతో ఇంటికి పిలిచారు. ఆ తరువాత అఘాయిత్యానికి పాల్పడి, సెల్ఫోన్ లో చిత్రించారు. ఎవరికైనా చెబితే వీడియోను బహిర్గతం చేస్తామని బెదిరించారు. దీంతో అమ్మాయి మౌనంగా వుండిపోయింది. కానీ వాళ్లలో ఒకడు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదికాస్తా బాలిక బంధువుకు చేరింది. దీంతో షాకైన ఆమె.. బాలికను నిలదీయడంతో, జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఆమె మలాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం వీరిని జువైనల్ కోర్టుకు తరలించామని సీనియర్ పోలీసు్ అధికారి తెలిపారు.
కాగా బాలిక తండ్రి చనిపోవడంతో అక్కతో కలిసి అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటోంది. ఈ ఘటన తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిందని బాలిక అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే గత అయిదు నెలల్లో మలాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది రెండవ గ్యాంగ్ రేప్ కేసు కావడం ఆందోళన రేపింది.