గ్యాస్ లీక్ : ఘోర ప్రమాదం తప్పింది

ఢిల్లీలోని ఓ స్కూల్‌ సమీపంలో గ్యాస్‌ లీకైంది. దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తుగ్లకాబాద్‌లోని రాణి ఝాన్సీ సర్వోదయ కన్య విద్యాలయ సమీపంలోని ఓ కంటేనర్‌ డిపోలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకైంది. గ్యాస్‌ దట్టంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న స్కూల్ విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు అంబులెన్స్‌లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. 50 మందికి పైగా విద్యార్థులకు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 100 మందికి పైగా విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. గ్యాస్ లీకేజీకు కారణాలపై ఎంక్వైరీ చేపట్టారు పోలీసులు. ఘటన కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం మనిష్ సిసోడయా. తగిన జాగ్రత్తలు తీసుకోని కారణంగానే లీకేజీ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.