గ్రంధాలయం బడ్జెట్ మీటింగ్…

 

. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంచిర్యాల జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో 2023-24 సం”నకు సంబంధించిన బడ్జెట్ సమావేశంలో బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ కు 5,00,000/-రూపాయలు మరియు కొత్త జిల్లా ఏర్పడ్డాక మంచిర్యాల జిల్లాలోని గ్రంథాలయాలలో 5సం”రాలనుండి జరిగిన అభివృద్ధి గురించి 25-30 పేజీల సోవరిన్ పుస్తకం ప్రచురణకు ఆమోదించడం అలాగే వేమనపల్లి గ్రంథాలయ భవనానికి ప్రహరీగోడ,గేటు, మరుగుదొడ్లు, నిర్మించుటకు ఆమెదం తెలపడం మరియు జిల్లాలోని శాఖ గ్రంథాలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, నూతన గ్రంథాలయాల భవనాలకు 45,00,000/-రూపాయలు మరియు పోటీ పరీక్షలకై ఆన్ -డిమాండ్ పుస్తకాలకు 5,00,000/- కొరకు ఆమోదం తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిఈవో వెంకటేశ్వర్లు, డిపివో ఫణిందర్ రావ్, డిపిఆర్వో సంపత్, జిల్లా గ్రంథాలయ సెక్రటరీ పాల్గొన్నారు.