గ్రామస్తుల దాడి దంపతులపై

ఉత్తరాఖండ్‌ లో దారుణం జరిగింది. రూర్కీ ప్రాంతంలో దంపతులపై గ్రామస్థులు దాడి చేశారు. మానవత్వం మరిచి భార్యాభర్తలిద్దరినీ చితకబాదారు. సాబిర్ పార్క్ దర్గా దర్శించుకోవటానికి వచ్చిన ఈ దంపతులు స్థానికంగా ఓ గెస్ట్ హౌజ్ లో సేదతీరారు. అదే వీరు చేసిన తప్పు అన్నట్లుగా గ్రామస్తులంతా ముకుమ్మడి దాడికి పాల్పడ్డారు. సాబిర్‌ పార్క్ వద్ద అక్రమంగా కొంతమంది గెస్ట్ హౌజ్‌ లను నడుపుతున్నారు. వీటి యాజమానులను ఏమీ చేయలేక గ్రామస్థులు అక్కడికి వచ్చిన జంటలపై తమ ప్రతాపం చూపటం మొదలు పెట్టారు. సమీపంలోనే పోలీస్‌ స్టేషన్ ఉన్నప్పటికీ పోలీసులు సైతం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దర్గా చూడటానికి వచ్చిన తమని అకారణంగా కొట్టారని దంపతులు విచారం వ్యక్తం చేశారు.