గ్రావిటీ ప్రీమియర్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలోని గ్రావిటీ ప్రీమియర్ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థిని,విద్యార్థులు నూతన వస్త్రాలతో రంగురంగుల పూలతో చక్కగా అలంకరించుకొని బతుకమ్మ ఆటపాటలను ఆడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బోడ పూన్య నాయక్, ప్రిన్సిపల్ బొడ్డుపల్లి బ్రహ్మచారి, ఉపాధ్యాయులు గంగ, సుజాత, స్వాతి, సంగీత, నాగమణి పియిటి సంధ్య, సుశీల విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.