గ్వాలియర్‌ రైల్వే స్టేషన్‌లోకి దూసుకొచ్చిన కారు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ రైల్వే స్టేషన్‌లోకి ఓ కారు వెళ్లింది. నేరుగా అది ప్లాట్‌ఫామ్‌ విూదకు వెళ్లింది. అయితే ఆ కారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ది అని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఆ ఆరోపణలపై తోమర్‌ స్పందించారు. కాంగ్రెస్‌ చేస్తున్నవి తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. రైల్వే స్టేషన్‌లోకి వెళ్లిన కారు ఎవరిదో తనకు తెలియదన్నారు. ఆ ఘటన గురించి కూడా తనకు అవగాహన లేదన్నారు. కారు రైల్వే ప్లాట్‌ఫామ్‌ విూదకు వెళ్లడం వివాదంగా మారింది.