ఘనంగా కాంగ్రెస్ 131వ వార్షిక సంబరాలు

2కాంగ్రెస్ పార్టీ 131 వ వార్షిక సంబరాలను ఘనంగా జరుపుకుంటోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ గాంధీ త్యాగాలను పార్టీ నేతలు గుర్తుచేసుకున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతిగా ఉందని…భవిష్యత్ లోనూ పేదల కోసం పోరాటం సాగిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.