ఘనంగా బతుకమ్మ సంబరాలు
గరిడేపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గరిడేపల్లి నందు బుధవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రకృతిలో ఉన్న పూలను సేకరించి బతుకమ్మ పండుగను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రజన్ ,పి హెచ్ ఎన్ ప్రమీల, సూపర్వైజర్ అంజయ్య గౌడ్, సోములమ్మ , ఎల్ టి ఉపేందర్, ఏఎన్ఎమ్స్ సరస్వతి ,విజయ, కవిత ,రేణుక, అంజలి, అరుణ , ఓఎస్ కృష్ణకుమారి, ఆశా కార్యకర్తలు ఉమా తదితరులు పాల్గొన్నారు.