ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.

జిల్లా ప్రధానకార్యదర్శి యు.రమేశ్ కుమార్.
జులై 12(జనంసాక్షి)కరీంనగర్ లో తన జన్మదిన సందర్భంగా గిరిజన పోడు భూముల గురించి రెండు గంటలు మౌనదీక్షలో కూర్చోవడం జరిగింది.అనంతరం వివిధ జిల్లాల నుండి విచ్చేసిన బీజేపీ శ్రేణుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించారు,ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గ నాయకులు ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా ప్రధానకార్యదర్శి యు.రమేశ్ కుమార్ తోపాటు జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు ,రాష్ట్ర మహిళా మోర్ఛా నాయకురాలు అంతారం లలిత,జిల్లా కార్యదర్శి భద్రేశ్వర్,జిల్లా మహిళామోర్ఛా అధ్యక్షురాలు సాహు శ్రీలత,మల్లేష్గ్ యాదవ్,తాండూరు పట్టణ అధ్యక్షుడు సుదర్శన గౌడ్,మండలాల అధ్యక్షులు ఆంజనేయులు, సందీప్, మహిపాల్,మండల ఇంచార్జిలు రజినీకాంత్, రమ్యనాయక్,ప్రభు శంకర్,చంద్రశేఖర్,బిజేవైఎం నాయకులు అంతారం కిరణ్,విక్రమ్ రెడ్డి, రమేష్సాగర్,శ్రీకాంత్ రెడ్డి,మారుతి చారి,చందు,సతీష్ లు పాల్గొన్నారు.