**ఘనంగా లింబాద్రి కి సన్మానం

మెట్ పల్లి టౌన్,అక్టోబరు10:
జనంసాక్షి
మెట్పల్లి పట్టణంలోని మైలారపు లింబద్రి ని రాజ రాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సత్రం, వేములవాడ ఆర్గనైజింగ్ సెక్రటరీ (కార్యానీర్వహణ కార్యదర్శి) గా నియమించబడిన సందర్భంగా శ్రీ వాసవి మత చైతన్య నగర్ వాడకట్టు సంఘం ఆధ్వర్యంలో సోమవారం లింబాద్రి ని పూలమాల శాలువాల తో ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ కార్యదర్శి మైలారపు లింబాద్రి ని ఈ సందర్భంగా వాడకట్టు సంఘ అధ్యక్షులు బండారి ప్రసాద్ మాట్లాడుతూ వాసవి మాత కృపతో ఎనో ఉన్నతమైన పదవులు పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాడకట్టు సంఘ కోశాధికారి చిలమంతుల శివకుమార్, బండారి శివ,చిట్టీమెల్లి శ్రీను,దొంతుల లక్ష్మీనారాయణ, అనంతుల రాకేష్,జొన్నల శ్రీను, శ్రీధర్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.