ఘనా గ్యాస్ స్టేషన్‌లో పేలుడు..78 మంది మృతి

fbwgzigpఅక్రా: ఘనా రాజధానిలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో బుధవారం పేలుడు సంభవించి 78 మంది చనిపోయారు. దేశ రాజధాని అక్రాలో సమీపంలోని లారీ టెర్మినల్‌లో తలెత్తిన మంటలు గ్యాస్ స్టేషన్‌తో పాటు ఇతర నివాస భవనాలకు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షాలు రాజధానిని ముంచెత్తడంతో స్థానికులు గ్యాస్ స్టేషన్‌లో తల దాచుకోగా ఈ దారుణం చోటు చేసుకున్నట్లు సమాచారం.