చండీ సర్పంచ్ భర్త అనిల్ ప్రసాద్ రెడ్డి ని పరామర్శించిన జడ్పీటీసీ

శివ్వంపేట అక్టోబర్ 13 జనంసాక్షి : మండల పరిధిలోని చండీ గ్రామ సర్పంచ్ ఉమా భర్త టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ ప్రసాద్ రెడ్డి గత కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కొద్దిగా కోలుకోవడం జరిగింది. దీంతో ఆయన చండీలోని ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు స్థానిక జడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా గురువారం స్వగ్రామంలో అనిల్ ప్రసాద్ రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వెంకటేశ్వరరావు, పెద్ద గొట్టిముక్ల ఉప సర్పంచి మోకాళ్ళ నవీన్, టిఆర్ఎస్ నాయకులు ముత్యంరెడ్డి, గోపాల్, పిఎసిఎస్ డైరెక్టర్  సురేష్ తదితరులు పాల్గొన్నారు.