చంద్రగిరి ఎన్‌కౌంటర్‌పై భగ్గుమంటోన్న తమిళనాడు

చెన్నై: చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎన్‌కౌంటర్‌పై తమిళనాడు భగ్గుమంటోంది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. అమాయకుల్ని బలిగొన్నారంటూ… తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వరుసగా మూడో రోజూ నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజకీయ పక్షాలు సైతం గొంతుకలపటంతో ఇది మరింత ఉద్ధృతమైంది. పలుచోట్ల అక్కడి నుంచి ఏపీకి రావాల్సిన బస్సులపై దాడులు జరిగాయి. భద్రతాపరమైన కారణాలతో… ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులన్నింటిని నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.